బీజేపీలో చేరిన ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ

బీజేపీలో చేరుతున్న నటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.

Rupali Ganguly joins BJP: ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు వినోద్ తావ్డే, అనిల్ బలూనీ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. నటుడు, జ్యోతిష్కుడు అమేయ జోషి కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ‘అందరినీ బీజేపీ వైపు ఆకర్షిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ’ అని కితాబిచ్చారు.

”నరేంద్ర మోదీ పని తీరు, వ్యక్తిత్వం.. ఆయన మన దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన తీరు చూసి ప్రతి భారతీయుడు మోదీ సేనలో చేరి దేశానికి సహకరించాలని కోరుకుంటున్నారు. నేను కూడా అలాగే భావించి బీజేపీలో చేరాను. మోదీ చేస్తున్న అభివృద్ధి మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని నాకు అనిపించింది. పార్టీకి నేను చేయగలిగింది చేస్తాను. అందుకు మీ అందరి సహకారం కావాల”ని ఆమె ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.

నడ్డాను కలిసిన రూపాలీ, జోషి
బీజేపీలో చేరిన తర్వాత.. రూపాలీ గంగూలీ, అమేయ జోషి ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కండువాలతో మరోసారి సాదరంగా నడ్డా ఆహ్వానించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీని రూపాలీ గంగూలీ కలిశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేశారు. మోదీ భక్తురాలిని అయినందుకు గర్విస్తానని పేర్కొంటూ పెద్ద వ్యాసమే రాశారు.

 

Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఢిల్లీ పోలీసులకు రిప్లై ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు