review on the defeat in Huzurabad : తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. హుజూరాబాద్ ఓటమిపై ఓ వైపు కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేస్తుంటే.. ఇంకోవైపు,.. నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఓటమిపై రేపు కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది.
ఇదే సమయంలో మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్కు లేఖ రాశారు. 1983నుంచి గెలుపే లేని హుజూరాబాద్పై రివ్యూ ఎందుకని ప్రశ్నించారు.
Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాదం..టిప్పర్ ఢీకొని ఒకరు మృతి
దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎందుకు రివ్యూ చేయరని లేఖలో ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపై కూడా సమీక్ష చేయాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.