Chilli Cuts Cultivation : విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపెట్టే మిరప సాగుపై తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశానిది మొదటిస్దానం . వర్షాధారంగా సాగుచేసే రైతులు ఎండుమిర్చికోసం సాగుచేస్తుండగా, నీటి వసతి వున్న రైతాంగం, ఆరుతడిపంటగా పచ్చిమిరప సాగుచేసి, చివరి కోతల్లో అవకాశాన్ని బట్టి ఎండుమిరప దిగుబడిని తీస్తున్నారు.
అయితే అధిక శాతం ఎండుమిరప సాగు చేసే రైతులే ఎక్కువ. రైతులు పంట పండించటంపైనే కాదు, అనంతంర కూడా కొన్ని యాజమాన్యపు మెళకువలను పాటించినట్లయితే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుంది.
READ ALSO : Farming Techniques: బెండసాగులో మెళకువలు
సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నాలుగైదు కోతలకు సిద్దమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు, కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం వుంది.
READ ALSO : Black Rice : నల్ల బియ్యానికి పెరుగుతున్న డిమాండ్, కిలో రూ.200… నల్ల వరిసాగు వైపు రైతుల మొగ్గు
ఇలాంటి ఇబ్బందులను అధిగమించి, నాణ్యమైన దిగుబడులు పొందాలంటే కోతలు, అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్ర్తీయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో అధిక ధర పొందాలంటే మిరప కోతల అనంతరం చేపట్టాల్సిన మెళకువలను గురించి తెలియజేస్తున్నారు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. వీరన్న. పూర్తి వివరాలకు క్రింది వీడియోపై క్లిక్ చేయండి..