Rahul Gandhi – Haryana: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పొద్దున్నే పొలాల్లో కనిపించారు. భారత్ జోడో యాత్ర స్టైల్ టీషర్టు, చిన్నపాటి నిక్కరులో వ్యవసాయ పొలాలు కలియతిరిగారు. రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయంలోని ఒడిదుడుకుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రాక్టర్తో పొలం దున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ ప్రాంతంలో రైతులు కనిపిస్తే ఇలా కాసేపు సందడి చేశారు.
బరోడా, మదీనా గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు తిరిగిన రాహుల్.. అక్కడి రైతులతో సంభాషిస్తున్న, పొలం దున్నుతున్న, నాటు వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు షేర్ చేసి ‘‘హర్యానాలో రైతుల మధ్య రాహుల్ గాంధీ’ అని ట్వీట్ చేశారు.
Haryana | On his way from Delhi to Shimla (Himachal Pradesh) Congress leader Rahul Gandhi reached Sonipat earlier this morning, where he met farmers at various villages of Baroda. He joined them in the sowing process, as they worked at the fields in Baroda and Madina. pic.twitter.com/IO3byBuN0y
— ANI (@ANI) July 8, 2023