Crop Loan Waiver : రైతులకు శుభవార్త.. నేటి నుంచి రుణమాఫీ, తొలి విడతలో రూ.19వేల కోట్లు

రైతాంగం సంక్షేమం, వ్యవసాయ అభివృధ్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. Crop Loan Waiver

Crop Loan Waiver

Crop Loan Waiver – CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతులకు మరో శుభవార్త చెప్పారు. రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నేటి(ఆగస్టు 3) నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. తొలి విడతలో 19వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయనున్నారు. తెలంగాణ రైతాంగం సంక్షేమం, వ్యవసాయ అభివృధ్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు.

రుణమాఫీ కోసం రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అందుకు మోక్షం కల్పించారు. నేటి నుంచే రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ బుధవారం ఆదేశించారు. రుణమాఫీ, వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీపై సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా పూర్తిగా రైతు రుణమాఫీ చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Also Read..Rs 2000 Notes: 2వేల నోట్లు మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

ఇప్పటివరకు 30 నుంచి 40వేల రుణాలు రైతులకు మాఫీ చేశారు. మిగతా రుణాలు(19వేల కోట్లు) మిగిలున్నాయి. ఆ రుణాలన్నింటిని నేటి నుంచి నెలన్నర లోపు అంటే సెప్టెంబర్ 15 కల్లా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీ అమలు ఆలస్యం కావడానికి కారణాలు కూడా చెప్పారు కేసీఆర్.

ఆర్థిక మాంద్యం, పెద్ద నోట్ల రద్దు, ఎఫ్ఆర్ బీఎం విషయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం కోత విధించడం, ఆర్థిక లోటు ఇలాంటి కారణాలతో రుణమాఫీ ఆలస్యమైందన్నారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం నేటి నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాలన్నీ కూడా నెలన్నర రోజుల్లో మాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.

Also Read..Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

ఇది కాంగ్రెస్ విజయం-రేవంత్ రెడ్డి
రుణమాఫీని పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ చేసిన రుణమాఫీ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ విజయంగా ఆయన అభివర్ణించారు. ఉద్యమాలు, పోరాటాల ఒత్తిడితోనే కేసీఆర్ రుణమాఫీని ప్రకటించారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతలు సీఎస్‌ను కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రుణమాఫీని అమలు చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రకటన చేశారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ అసమర్థత వల్లే రుణమాఫీ నాలుగేళ్లు ఆలస్యమైందని విమర్శించారు రేవంత్ రెడ్డి.

ట్రెండింగ్ వార్తలు