Tollywood : చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్ కూడా.. జగన్‌ని కలవడానికి వెళ్తున్న స్టార్స్

ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో వీరంతా సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం..........

Chiranjeevi :  సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యలకు ఎలాగైనా తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. చిరంజీవి ఇప్పటికే జగన్ ని కలిసి మాట్లాడి వచ్చారు. ఇక్కడ మరికొంతమంది సినీ పెద్దలతో మాట్లాడి మరోసారి జగన్ ని కలవడానికి వెళ్తున్నారు. ఈ సారి చిరంజీవితో పాటు నాగార్జున, మహేష్, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలు, రాజమౌళి, కొరటాల శివ.. మరికొంతమంది పెద్దలు జగన్ ని కలవడానికి వెళ్తున్నారు. చిరంజీవి ముందుండి అందర్నీ నడిపిస్తున్నారు. సినీ ప్రముఖులందర్నీ ఇందులో భాగం చేసి సినీ పరిశ్రమకి మంచి జరగడానికి కృషి చేస్తున్నారు.

Raviteja : నేను జాతకాన్ని నమ్మను.. సినిమా నాకు నచ్చితే మీకు నచ్చినట్టే..

ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో వీరంతా సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జగన్ నివాసానికి వెళ్తారు. జగన్ తో సినీ పరిశ్రమ సమస్యల గురించి, టికెట్ రేట్ల ధరల గురించి చర్చించి ఆయనతో లంచ్ చేసి తిరుగు ప్రయాణమవనున్నారు. అయితే మొదటిసారి స్టార్ హీరోలు అంతా ఏపీ సీఎం జగన్ ని కలవడానికి వెళ్తుండటంతో ఈ సమావేశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు