Vijayashanthi : ఇటీవల తమిళనాడులో ఓ మిషనరీ స్కూల్లో బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన దేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియచేశారు. మతమార్పిళ్లను ఆపాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బాలిక ఆత్మహత్యపై బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేసిన కమిషన్కు విజయశాంతి సారథ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. తంజావూరులో ఆ బాలిక తల్లిదండ్రులతో విజయశాంతి భేటీ అయ్యారు. ఆ తర్వాత చెన్నై వెళ్లారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళతో విజయశాంతి చెన్నైలో భేటీ అయ్యారు.
Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయశాంతి శశికళతో మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగిందని తెలిపారు. జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి జ్ఞాపకం చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఒక నటిగా జయలలితని గుర్తు చేసుకుంటూ శశికళని కలిసారా? లేదా పార్టీ పరంగా విజయశాంతి కలిసారా అని ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో తలెత్తుతున్నాయి.
சின்னம்மா அவர்கள் எனக்கு அம்மா போன்றவர், நான் அவர்களுக்கு மகள் போன்றவள்.
நல்லது செய்தவர்களுக்கு நல்லது நடக்கும். – பாஜக தேசிய செயற்குழு உறுப்பினர் விஜயசாந்தி
చిన్నమ్మా వాళ్ళు నాకు తల్లిలాంటి వాళ్ళు, నేను వాళ్ళకి కూతురులాంటిదానిని.
మంచి చేసే వారికి మంచే జరుగుతుంది. #Ramulamma pic.twitter.com/hxGYEYDUhp
— Team Vijayashanthi (@VJSOffice) February 2, 2022