Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మళ్ళీ మారిందా?

చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆర్‌కె బీచ్‌లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ మొదట ఆలోచన చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఈవెంట్ చేసుకోడానికి నిరాకరించిందని, దీంతో చిత్ర బృందం వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి ప్రీ రిలీజ్ వేదికను మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిన్న వార్తలు వినిపించాయి. అయితే నేడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి మరో వార్త బయటకి వచ్చింది.

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ మేకర్స్ చెబుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

Waltair Veerayya : ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసిన వాల్తేరు వీరయ్య..

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆర్‌కె బీచ్‌లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ మొదట ఆలోచన చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఈవెంట్ చేసుకోడానికి నిరాకరించిందని, దీంతో చిత్ర బృందం వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి ప్రీ రిలీజ్ వేదికను మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిన్న వార్తలు వినిపించాయి. అయితే నేడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి మరో వార్త బయటకి వచ్చింది.

ఈ ఈవెంట్ ని మొదటిగా అనుకున్నట్లు ఆర్‌కె బీచ్‌లోనే నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేసిన మూవీ టీం.. వేదికను మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో మెగాఫ్యాన్స్ నిర్మాతలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇవ్వాలన్నా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.

ఇక ఇవాళ థియేటరికల్ ట్రైలర్ ని విడుదల చేస్తాం అని చెప్పిన మూవీ టీం. టైంని మరి కాసేపటిలో చెబుతాము అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. చిరంజీవి గ్యాంగ్‌స్టార్‌గా, జాలరుగా రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కానుంది.

 

ట్రెండింగ్ వార్తలు