ఛండీగఢ్ రైల్వే స్టేషన్లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది. అంధులు రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఈ ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
రైల్వే స్టేషన్ లోని అన్ని ప్లాట్ఫారాలలో బ్రెయిలీ లిపిలో బోర్డులను అధికారులు ఏర్పాటు చేసిన అంబాలా మండలి డీఆర్ఎం గురిందర్ మోహన్ సింగ్ ప్రారంభించారు.
స్టేషన్లో ఎంట్రీలోను..ప్లాట్ఫారం, డ్రింకింగ్ వాటర్ ఉండే ప్లేసులు, లిఫ్టు, ఎక్స్లేటర్, మెట్లు వంటి అన్ని చోట్ల బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డుల్ని అందుబాటులో ఉంచారు.
దేశంలో అంధుల కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ లిపి బోర్డుల్ని ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, కోయంబత్తూరు, బోరీవలీ, మైసూరు రైల్వే స్టేషన్లలో బ్రెయిలీ లిపి బోర్డులు ఉండగా చండీగఢ్ లో తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు.