T20 team: భారత్కు ‘పవర్ హౌస్’లాంటి టీ20 క్రికెట్ జట్టు ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లీ జిలెజ్ కొనియాడారు. ఇంగ్లండ్లో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచుల్లో గెలిచింది. మూడో మ్యాచులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై ఆష్లీ జిలెజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… టీమిండియాలో అందరూ శక్తిమంతమైన ఆటగాళ్ళు ఉన్నారని చెప్పారు.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
టీమీండియా బౌలింగ్ తీరు అద్భుతంగా ఉందని ఆష్లీ అన్నారు. క్రికెట్లో కొన్ని సార్లు బౌలర్లదే హవా ఉంటుందని చెప్పారు. అయితే, ఎన్ని వికెట్లు కోల్పోతున్నామన్న విషయాన్ని పక్కనబెడుతూ బ్యాట్స్మెన్ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తూ వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాల్సి ఉంటుందని అన్నారు. టీమిండియాకు ఈ సామర్థ్యం ఉందని తెలిపారు. కాగా, ఇంగ్లండ్తో టీమిండియా నేడు మూడో టీ20 ఆడనుంది. రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.