అనసూయ అదరగొట్టేసింది.. ఇక సోషల్ మీడియా షేకే..

Paina Pataaram: ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో గుర్తింపు తెచ్చకున్న యంగ్ హీరో కార్తికేయ, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’..

ఈ సినిమాలో స్టార్ యాంకర్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. సాంగ్ మేకింగ్‌ వీడియో వదలగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. శనివారం ఈ సినిమాలో నుండి ‘పైన పటారం’ అనే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు..

అనసూయ అందచందాలతో అదరగొట్టేసింది.. ఈ సాంగ్ థియేటర్లలో ఊపు ఊపుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ ఆడియెన్స్‌కి మాంచి ఊపిచ్చేలా ఉన్న ‘పైన పటారం’ ఫుల్ వీడియో మార్చి 1 సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చెయ్యనున్నారు. ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రెండింగ్ వార్తలు