Woman sexually assaulted : మహిళల రక్షణకు నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో మహిళపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. జూన్ 2న జోర్ బాగ్ మెట్రో రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. బాధిత మహిళ కూడా ట్విట్టర్లో తనకు ఎదురైన అనుభవాన్ని వరుస ట్వీట్లలో వెల్లడించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Train Coach: రైలు కోచ్లో టీనేజర్ ఆత్మహత్యకు కారణం గ్యాంగ్ రేప్!!
పోలీసుల కథనం ప్రకారం జూన్ 2న మహిళ ఢిల్లీ మెట్రో రైలు యల్లో లైన్లో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి ఆమెను అడ్రస్ అడిగాడు. అడ్రస్ వివరాలు చెప్పిన అనంతరం ఆమె జోర్ బాగ్ మెట్రో రైల్వే స్టేషన్లో దిగి క్యాబ్ బుక్ చేసుకునేందుకు అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ఇంతలోగా నిందితుడు మరోసారి ఆమె వద్దకు వెళ్లి తనకు కావాల్సిన అడ్రస్ గురించి అడిగాడు.
ఆమె మరోసారి ఆయా వివరాలు చెబుతుండగా నిందితుడు తన ప్రైవేట్ భాగాలు చూపుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి చర్యలతో భయపడిన మహిళ అక్కడి నుంచి పరుగు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఆపై నిందితుడు కూడా ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.