పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసుల తనిఖీలు

Delhi Schools: ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరింపులు రావడం గమనార్హం.

Schools in Delhi: ఢిల్లీ ఎన్సీఆర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మొత్తం దాదాపు 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు. స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.

Also Read: ఎన్నికల వేళ శుభవార్త.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో తగ్గుదల

బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న స్కూళ్లలో మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురి లోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి.

స్కూళ్లను ఖాళీ చేయించి తనిఖీలు చేసిన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు విదేశాల నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, దేశంలో ఎన్నికల వేళ రెండు రోజుల క్రితం భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరింపులు రావడం గమనార్హం.

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి కూడా..
ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పోలీసులకు సమాచారం అందించింది. బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వివరాలను పోలీసులు తీసుకున్నారు.

ఒక్క పాఠశాలలో కూడా బాంబు దొరకలేదు..
ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపుల ఈ మెయిల్స్ పై ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిశీ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు భయపడవద్దని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో ఢిల్లీలో ఏ ఒక్క పాఠశాలలో కూడా బాంబు దొరకలేదని అన్నారు. విద్యార్థులను ఖాళీ చేయించి సోదాలు చేస్తున్నారని తెలిపారు.

Also Read: బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్‌దారుల నగదును జమ చేయాలని నిర్ణయం.. ‘మే’డే బ్యాంకులు బంద్

ట్రెండింగ్ వార్తలు