Missing Case: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన కుర్రాడు

తప్పిపోయిన సమయంలో మహేంద్ర నల్లటి టీ షర్టు, చిన్న నలుపు రంగు ప్రింట్‌తో ఉన్న ఆకుపచ్చ ట్రౌజర్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ఓ కుర్రాడు కనపడకుండాపోయాడు. అతడు కనపడితే ఆచూకీ తెలపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పిపోయిన తమ అబ్బాయి పేరు మహేంద్ర విట్టల్ సాయి రాజు అని, వయస్సు 18 సంవత్సరాలు 7 నెలలు ఉంటుందని తెలిపారు.

జీఆర్పీ ఎస్సీ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించామని వివరించారు. తాము అందరం గేట్ నంబర్ 3 నుంచి ప్రవేశించామని, ప్లాట్‌ఫాం నంబర్ 1కి చేరుకున్నామని అన్నారు. తమ అబ్బాయి మాత్రం అక్కడికి చేరుకోలేకపోయాడని, తాము వెంటనే ప్లాట్‌ఫాం నం.1తో పాటు ఇతర ప్రదేశాలలో క్షుణ్ణంగా వెతికామని, అతని ఆచూకీ లభించలేదని తెలిపారు.

తప్పిపోయిన సమయంలో మహేంద్ర నల్లటి టీ షర్టు, చిన్న నలుపు రంగు ప్రింట్‌తో ఉన్న ట్రౌజర్ ధరించాడని వివరించారు. అతడు కనపడితే మొబైల్ నం. 7987067541 లేదా 9424651982కు ఫోన్ చేయాలని కోరారు.

Also Read: ఆమె నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉంది- వాణి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు