Botsa Satyanarayana: అర్జెంటుగా అధికారంలోకి వచ్చి, గిట్టని వారిపై మీరు..: పవన్ పొత్తు కామెంట్స్‌పై ఏపీ మంత్రులు

ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు అని అంబటి అన్నారు.

Botcha Satyanarayana - Ambati Rambabu

Botsa Satyanarayana – Ambati Rambabu: ఎన్నికల్లో జనసేన(JanaSena), టీడీపీ (TDP) కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు.

‘ ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు. ఎప్పుడో అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా “ములాఖత్”.. జన సైనికులూ… ఆలోచించండి. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా లేదూ? ’ అని అంబటి రాంబాబు ట్వీట్లు చేశారు.

ఈ పొత్తులు, జిత్తులు వైఎస్సార్ సీపీని ఏమీ చేయలేవు అంటూ బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. ‘ అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి, గిట్టని వారందరిపై కక్ష తీర్చుకోవాలి అన్న దురాలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వీరిలో లేదు. ఏ మాత్రమైనా కనబడుతుందా? ఇలాంటి పొత్తులు ఎన్ని పొడిచినా ప్రజాబలం మెండుగా ఉన్న జగన్ ని ఏమీ చేయలేవు. రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తు, ఎప్పటికీ వారి సంక్షేమమే మా ధ్యేయం. వారే మా బలం ’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

BJP: టీడీపీతో పొత్తు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందన

ట్రెండింగ్ వార్తలు