AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. జైపూర్‌కి నారా లోకేశ్.. బెంగళూరుకి జగన్

విమానాశ్రయం చేరుకున్న లోకేశ్.. అక్కడ ఒ చిన్నారిని ముద్దాడి ఫొటో దిగారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి, మంత్రి నారా లోకేశ్ జైపూర్‌కి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరుకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

వెలగపూడి సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.

జైపూర్ వెళ్లడానికి ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేశ్.. అక్కడ ఒ చిన్నారిని ముద్దాడి ఫొటో దిగారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రతి కార్యకర్తతోనూ లోకేశ్ ఫొటో దిగారు. అనంతరం ప్రత్యేక విమానంలో జైపూర్ వెళ్లారు.

బెంగళూరుకి జగన్
సతీసమేతంగా బెంగళూరుకి వెళ్లారు మాజీ సీఎం జగన్. మొదట తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు జగన్. విమానాశ్రయంలో జై జగన్.. జై జై జగన్.. సీఎం జగన్.. జై జగన్.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు.

Also Read: మంత్రి కొండా సురేఖని కలిసిన రేణూ దేశాయ్

ట్రెండింగ్ వార్తలు