Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయం

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Badvel By Poll : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీ మంగళవారం ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి డా.సుధ స్పష్టమైన అధిక్యం ప్రదర్శించారు. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి ఆమె 68 వేల 492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అన్ని రౌండ్లలో కలిపి వైసీపీకి 84 వేల 682, బీజేపీకి 16 వేల 190, కాంగ్రెస్ కు 5 వేల 026 ఓట్లు పోలయ్యాయి. ఫ్యాన్ ముందు ఏ గుర్తు నిలవలేకపోయింది. వార్ వన్ సైడ్ గా మారిపోయింది. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువగా వైసీపీ అభ్యర్థి. డా.సుధకు పోలయ్యాయి.

Read More : YCP Candidate Dr.Sudha : వార్ వన్ సైడ్, భారీ మెజార్టీ దిశగా వైసీపీ

బద్వేల్ లో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలబడినా…ఆశించినంత ఫలితాలు రాబట్టలేదు. మొత్తంగ వైసీపీ ఖాతాలో మరో నియోజకవర్గం వచ్చి చేరింది.

ట్రెండింగ్ వార్తలు