Vijayawada : వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులు.. పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వెలంపల్లి

టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

TDP - YCP

Vijayawada TDP Activists Joined YCP : విజయవాడలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. పలువురు కార్యకర్తలు టీడీపీని వీడారు. టీడీపీ శ్రేణులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు చిట్టినగర్ నుంచి భారీ మోటారు ర్యాలీ నిర్వహించారు.

అంతకముందు వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు బెజవాడకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తమ హయాంలో జగన్ ఏం ఇచ్చారో తాము చెప్పగలమని అన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని వ్యాఖ్యానించారు.

TTD : టీటీడీకి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

లోకేష్ విజయవాడ పశ్చిమకు పది నిమిషాలు హాల్టింగ్ కు వచ్చాడని, ఎందుకు వస్తున్నాడో ఎందుకు వెల్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. విజయవాడలో ప్రజాధరణ లేకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనాలను పాదయాత్రకు రప్పించారని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీడీపీ నుంచి వైసీపీలో చేరారని శ్రీనివాసరావు తెలిపారు.

మహిళలకు రాఖీ పంపిస్తాను.. 45 రోజులు జపం చేయమని చెప్పడానికి చంద్రబాబు ఏమైనా దేవుడా అని ప్రశ్నించారు. బలం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. లోకేష్ యువగళం పాదయాత్ర, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు, చంద్రబాబు కార్యక్రమాలకు జనాలు లేక చంద్రబాబుకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. లోకేష్ కు దమ్మూ, ధైర్యం ఉంటే పశ్చిమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే టీడీపీని మూసేస్తారా అని ఛాలెంజ్ చేశారు.

Botsa Satyanarayana : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా? మంత్రి బొత్స

మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రకాశం బ్యారేజీ వద్ద యువగళానికి టీడీపీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2 కిలోమీటర్ల బ్యారేజీ పొడవునా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి అయింది. ప్రకాశం బ్యారేజి వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు లోకేష్ కు వీడ్కోలు పలికారు. యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. పసుపు, ఎరుపురంగు బెలూన్లతో యువనేతను ఉమ్మడి కృష్ణా జిల్లా, నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు.

భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు.

ట్రెండింగ్ వార్తలు