TDP @ 40 Years : తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వివిధ దేశాల్లో స్ధిర పడిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు ఘనంగా జరుపుతున్నారు.
ఈ సందర్బంగా వారినుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు…..తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టిందని.. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవను రద్దు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకు వచ్చారని అన్నారు.
ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఆహార భీమా పధకాన్ని ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యం పధకంతో ఎప్పుడో అమల్లో పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పార్టీని బలోపేతం కానుందని పార్టీ స్ధాపించిన ముహూర్త బలం గొప్పదని చంద్రబాబు పేర్కోన్నారు.
Also Read : Telugu Desam Party : టీడీపీ 40 ఏళ్ల వ్యవస్ధాపక దినోత్సవం
రాజకీయాలలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ తట్టుకుని నిలబడుతుందని… ఎంత మంది పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని చూసినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకు వెళతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎవరు ఏ దేశంలో ఉన్నా రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్ఆర్ఐలు సహకరించాలని ఆయన కోరారు. సుమారు 40 దేశాలలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి.