Madhya Pradesh: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి పట్టిస్తే రూ.10 వేలు ఇస్తారట. ప్రకటన చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే?

ఆగస్టు 3వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం గమనార్హం. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Vivek Vaish: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా మోర్నా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం(ఆగస్టు 3) బీజేపీ ఎమ్మెల్యే రాంలల్లు వైష్ కుమారుడు వివేక్ వైష్ ఓ గిరిజన యువకుడిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల కేసులో 4 రోజులకు పైగా గడిచినా, నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో పరారీలో ఉన్న నిందితులపై సింగ్రౌలీ పోలీసులు 10,000 రూపాయల రివార్డు ప్రకటించారు.

Supreme Court: బీహార్‭లో కులగణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

కాల్పుల్లో నిందితుడి కుమారుడు వివేకానంద వైష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగ్రౌలి ఎమ్మెల్యే రాంలల్లు వైష్ అన్నారు. గత ఐదేళ్లుగా చట్కాలో ఇల్లు కట్టుకుని వారి నుంచి విడిగా నివసిస్తున్నారట. పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఘటన జరిగిన గంటపాటు వివేకానంద వైష్ మోర్వ పోలీస్ స్టేషన్ లోనే ఉండిపోయారని ప్రజలు చెబుతున్నారు. అయితే పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గిరిజన యువకుడితో జరిగిన ఘటనను ఎమ్మెల్యే ఖండిస్తూ.. కాల్పులకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఎవరిపైనా ఒత్తిడి లేదని, తన కొడుకు దోషి అయితే చట్టం శిక్షిస్తుందని ఎమ్మెల్యే రాంలల్లు అన్నారు.

2024 Elections: వచ్చే లోక్‭సభ ఎన్నికల్లో బీజేపీ కుంభస్థలాన్ని దెబ్బకొట్టేందుకు కీలక పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, ఆప్

ఆగస్టు 3వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం గమనార్హం. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదివాసీ యువకుడిని కాల్చిచంపిన తర్వాత వివేకానంద్ వైష్ మోర్వా పోలీస్ స్టేషన్‌లోనే గంటసేపు కూర్చున్నాడు. అతడిని అరెస్టు చేయడానికి బదులుగా, పోలీసులు అతడికి వంగి నమస్కారాలు చేశారని విమర్శిస్తున్నారు. అతడు తప్పించుకోవడంలో పోలీసుల హస్తం ఉందని సామాన్యుల్లో కూడా చర్చ జరుగుతోంది. వివేకానంద్ ఇంతకు ముందు కూడా అనేక కాల్పుల ఘటనలకు పాల్పడ్డ చరిత్ర ఉంది.

Independence Day 2023 : తెలంగాణలో మహాత్మా గాంధీ గుడి .. బాపూజీ ఆలయం ఎన్నో సేవలకు నిలయం

మోర్వ కాల్పుల కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్యే కుమారుడు వివేకానంద్ వైష్‌పై 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 7 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నిందితులపై ఎస్సీ-ఎస్టీ చట్టం, దాడి, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. కానీ ఎమ్మెల్యే కుమారుడిపై ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అధికారం, ప్రాబల్యం ఆధారంగా నిందితులకు శిక్షలు పడకపోవడం మామూలే. నిందితుడు వివేకానంద కూడా ఎన్‌సీఎల్ ఉద్యోగి. వాళ్లు కూడా అతడిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.

ట్రెండింగ్ వార్తలు