Delhi shocker : మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళకు రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై స్త్రీ ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదనిపిస్తోంది. దేశంలో ఏదో ఒక చోట ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నడిబొడ్డున ప్రాంతంలో మహిళలపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Pumpkin Seeds : శరీరానికి పోషకాలనిచ్చే గుమ్మడిగింజలు
ఢిల్లీలోని.. షాలిమార్ బాగ్లోని రెసిడెన్షియల్ కాలనీలో రాత్రి 10గంటల 15 నిమిషాలకు ముగ్గురు మహిళలు కారులో వచ్చారు. కారుని పార్కింగ్ చేశారు. ఆ తర్వాత కారు దిగారు. వారు కారు దిగిన వెంటనే వెనుక నుంచి కొంతమంది దుండగులు వారి దగ్గరికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం వారిపై స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గత నెల 19 న జరిగింది. ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Thippatheega : ఆరోగ్య సమస్యలకు తిప్పతీగ
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోజు రాత్రి వీధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి, నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఘర్షణకు కారణం ఏంటి..? దుండగులకు, మహిళలకు ఏంటి సంబంధం? అనేది తెలియాల్సి ఉంది. కాగా, మహిళలపై దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
#WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19
Based on the woman’s complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said.
(CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu
— ANI (@ANI) December 1, 2021