Duplicate Yogi (Photo : Google)
Duplicate Yogi : అచ్చం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలా ఉండే సురేశ్ కుమార్ యోధా దారుణ హత్యకు గురయ్యారు. సురేశ్ కుమార్ యోధా డూప్లికేట్ యోగిగా గుర్తింపు పొందారు. సురేశ్ కుమార్ యోధాలో చాలావరకు సీఎం యోగి పోలికలు ఉన్నాయి. సురేశ్ కుమార్ యోధా సమాజ్ వాదీ పార్టీకి ప్రముఖ ప్రచారకర్త. సురేశ్ మరణ వార్తను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో తెలిపారు. సురేశ్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సురేష్.. ఉన్నావ్ జిల్లా వాసి. సమాజ్ వాదీ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించే వారిలో చురుకైన వ్యక్తి.
సురేష్ మృతి వార్త తెలియగానే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు. ”సమాజ్వాదీ పార్టీకి ప్రచారకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేశ్ ను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం హృదయ విదారకమైన సంఘటన. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.
సురేష్ కుమార్ యోదా ఉన్నావ్లోని సోహరమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాయ్ గ్రామానికి చెందినవాడు. జూలై 28న తన భర్త సురేష్ను అతని ఇద్దరు సోదరులు దారుణంగా కొట్టారని సురేశ్ భార్య వెల్లడించింది. దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారి మరణించాడు.
సురేష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేశ్ మరణవార్త తెలియగానే, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలియజేసి నివాళులర్పించారు.
ఉన్నావ్ పోలీసులపై సురేష్ కుమార్ యోధా భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. దాడి జరిగిన తర్వాత తాను సోహరామౌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నిందితులతో పోలీసులకు సంబంధాలున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. న్యాయం కోసం ఎంతో పోరాటం చేశానని కానీ ప్రయోజనం దక్కలేదని కన్నీటిపర్యంతం అయ్యారు.
సురేష్ కుమార్ యోధా సమాజ్ వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన తరచూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి వెళ్లే వారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉండడమే ఆయన ప్రాధాన్యతకు ఒక ముఖ్యమైన కారణం. సీఎం యోగి మాదిరిగానే ఆయన వేషధారణ ఉండేది. అంతేకాదు మాట్లాడే శైలి కూడా అచ్చం యోగిలానే ఉండేది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అఖిలేష్ యాదవ్తో సురేష్ కుమార్ యోధా ఉన్న ఫోటో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. విమానంలో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ఎస్పీ చీఫ్తో సురేశ్ కి ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన ప్రజలు సురేశ్ కి త్వరలో పార్టీలో ముఖ్యమైన స్థానం దక్కుతుందని భావించారు. అఖిలేష్ యాదవ్ ప్రచారానికి బయలుదేరినప్పుడల్లా, సురేశ్ తరచుగా ఆయనతో పాటు కనిపించేవారు. సురేశ్ ద్వారా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేస్తూ చురకలు అంటించేవారు.
सपा के प्रचारक के रूप में अपनी एक अलग पहचान बनाने वाले सुरेश ठाकुर की पीट-पीट कर हत्या की घटना अत्यंत हृदय विदारक है।
सरकार से अपील है कि वह जल्द से जल्द दोषियों के खिलाफ उचित कार्यवाही सुनिश्चित करे।
भावभीनी श्रद्धांजलि। pic.twitter.com/cK0MmaP81P
— Akhilesh Yadav (@yadavakhilesh) August 11, 2023