Jeevitha – Rajasekhar : పరువు నష్టం దావా కేసులో జీవిత, రాజశేఖర్ కు జైలుశిక్ష.. బెయిల్ మంజూరు

జీవిత, రాజశేఖర్ 2011లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

Jeevitha Rajasekhar

Nampally court : పరువు నష్టం దావా కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. జీవిత, రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలుశిక్ష విధించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అమ్ముకుంటోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి పేరుతో నడుస్తోన్న స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలపై అసత్య ఆరోపణలు చేశారని సినీ నిర్మాత అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది. అనంతరం అప్పీల్ కు వెళ్లేందుకు సమయం ఇస్తూ వారికి బెయిల్ మంజూరు చేసింది.

Sri Ramana : ప్రముఖ రచయిత కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..

జీవిత, రాజశేఖర్ 2011లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక వారి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతో మంది సహాయం పొందుతున్నారని అల్లు అరవింద్ తెలిపారు.

అలాంటి చిరంజీవి పరువుకు భంగం కలిగించేలా జీవిత, రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలు, చిరంజీవి ట్రస్ట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవితా, రాజశేఖర్ లపై అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు.

Bengaluru : బెంగళూరులో పేలుళ్లకు పథకం…ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించిన వారిద్దరి నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదల అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు