Hyderabad: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను హైదరాబాద్, అంబర్పేట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
BiggBoss 6 Day 61 : బిగ్బాస్లో కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా??
వీళ్లంతా ఒక ఫంక్షన్ కోసం అంబర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. సరదాగా ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో మునిగి మరణించిన వారి మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.