Khammam : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. జిల్లాలోని వైరా మండలం పుణ్యపురానికి చెందిన కమ్మంపాటినరేష్ అనే యువకుడికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన మరియమ్మతో జూన్ 4వ తేదీ శనివారం ఉదయం చర్చిలో వివాహం జరిగింది.
5వతేదీ ఆదివారం ఉదయం వరుడు స్వగ్రామం పుణ్యపురంలో రిసెప్షన్ జరిగింది. కాగా సోమవారం తెల్లవారుఝామున నరేష్ బాత్రూంలో రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. ఇది చూసిన కుటుంబీకులు నిర్ఘాంత పోయారు. నరేష్ బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతిపై అతని తల్లితండ్రులు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Rajya Sabha Polls: ఓటు వేస్తా.. ఒక్కరోజు బెయిల్ ఇవ్వండి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్