Telangana : అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్‌ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగనున్నాయి.

Intermediate First Year Exams : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈ మేరకు శుక్రవారం ఇంటర్‌ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్‌ 25, 2021 నుంచి నవంబర్‌ 2, 2021 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్‌ ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ సెకండ్ ఇయర్ కు ప్రమోట్‌ చేశారు. కరోనా తీవ్రత తగ్గిందని ఆగస్టులో వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెల క్రితమే పేర్కొన్నారు.

Medical College : తెలంగాణలో మరో కొత్త మెడికల్ కాలేజీ

విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఇయర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు