Viral video: ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా తండ్రిగా తన బాధ్యతను విస్మరించలేదు ఆ రిక్షావాలా. అతడి భార్య ఇంకొకరి మోజులో పడి అతడితో కలిసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ, తన కూతురు, కుమారుడికి అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు ఆ తండ్రి. తాజాగా, అతడికి సంబంధించిన ఓ వీడియోను ఒకరు తీయడంతో అది దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ల్ని జబల్పూర్లో రాజేశ్ అనే వ్యక్తి రిక్షా నడుపుతూ జీవిస్తున్నాడు.
రాజేశ్ బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన్ని నెలల క్రితం అతడి భార్య మరొక వ్యక్తితో కలిసి వెళ్ళిపోయింది. దీంతో తన పిల్లలు అనాథలు కాకూడదని వారిని రాజేశ్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. కూతురికి దాదాపు మూడేళ్ళ వయసు ఉంటుంది. ఆమెను ఇంటి వద్ద వదిలి ఏడాది వయసున్న తన కొడుకుని రిక్షాలో తన వెంటే తీసుకెళ్తున్నాడు.
రిక్షా తొక్కగా వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తున్నాడు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. తాజాగా, ఒక చేత్తో తన కుమారుడిని ఎత్తుకుని అతడు రిక్షా తొక్కుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. తనను, పిల్లలను వదిలి మరో యువకుడితో వెళ్ళిపోయిన తన భార్య ఇక తనకు వద్దని, తన పిల్లలు చాలని, వారిని బంగారంలా చూసుకుంటానని రాజేశ్ అంటున్నాడు. ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాడు. అతడికి వచ్చిన కష్టం కంటతడి పెట్టిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
In an era of multitude of pro poor schemes, a man in MP’s Jabalpur city, forced to drive cycle rickshaw while responsibly clutching infant son in one hand — all to feed his family, comprising him, infant son and daughter. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/D1VzrSHEu7
— Anuraag Singh (@anuraag_niebpl) August 25, 2022