Bigg Boss 5 : ఈ సీజన్ బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోతుంది. అయితే ఈ సీజన్ లో అన్ని సీజన్స్ కంటే ఎక్కువ గొడవలు ఉన్నాయి. అంతే కాక ఇప్పుడు ఫైనల్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ అభిమానులు వేరే కంటెస్టెంట్స్ మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు. యాంకర్ రవిని అయితే మరింత టార్గెట్ చేశారు. రవి ఫ్యామిలీని కూడా తిడుతూ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడూ, బయటకి వచ్చిన తర్వాత కూడా ఈ ట్రోలింగ్ ఆగలేదు.
ఫ్యామిలీని కూడా తిడుతూ కామెంట్స్ చేయడంతో రవి సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనని, తన ఫ్యామిలీని దూషించే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకున్నారు. కేవలం రవినే కాదు మరి కొంతమంది కంటెస్టెంట్స్ ని కూడా ఇలాగే సోషల్ మీడియాలో వేధిస్తున్నారు ఫైనల్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ అభిమానులు. దీంతో రవి స్పందించడంతో వారు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై యాని మాస్టర్ కూడా స్పందించింది.
Pushpa- 1 : పుష్ప సినిమాను అడ్డుకుంటాం..భార్య బాధితుల సంఘం
యాంకర్ రవి పోలీసులని కలిసి ఇలా ఫిర్యాదు చేసే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి బిగ్ బాస్ గురించి ఓ పోస్ట్ పెట్టింది యాని మాస్టర్. రవి తీసుకున్న నిర్ణయాన్ని యాని మాస్టర్ సపోర్ట్ చేస్తూ… నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్గా ఉన్నానో మీకు తెలుసు అంటూ స్టార్ మా ఛానల్ ని కూడా ఈ వివాదంలోకి లాగింది. బిగ్బాస్ హౌస్లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదు. కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ షో అని చాలా మంది తెలుసుకున్నారు. యాని మాస్టర్ పోస్ట్ తో ఇది మరోసారి రుజువైంది అని అంటున్నారు. దీని గురించి తెలుసుకొని ఇప్పటికైనా ఈ ట్రోలింగ్ ఆపాలని కోరుకుంటున్నారు మాజీ కంటెస్టెంట్స్.