MLC Kavitha Letter: ప్రీతి కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాము: ఎమ్మెల్సీ కవిత

వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

MLC Kavitha Letter: వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

యావత్తు రాష్ట్ర ప్రజలు ప్రీతి కుటుంబం వెంట ఉన్నారని కవిత తెలిపారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత ఇవాళ ఓ లేఖ రాశారు. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని చెప్పారు. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో తానూ ఒకరినని కవిత అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు.

చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. కడుపుకోత అనుభవిస్తున్న ప్రీతి తల్లిదండ్రులకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుందని చెప్పారు. ఏ తల్లిదండ్రులకూ రాకూడని పరిస్థితి ఇదని అన్నారు.

ప్రీతి కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు ప్రీతి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని చెప్పారు.

CM Jagan Challenge : 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? చంద్రబాబు, పవన్‌కు సీఎం జగన్ సవాల్

ట్రెండింగ్ వార్తలు