Rashmika Mandanna
Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కు పరిచయయైంది రష్మిక మందన్న. ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది ఈ కన్నడ భామ. ‘పుష్ప’ చిత్రంతో నేషనల్ క్రష్గా మారిపోయింది. తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మడికి 38 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా రష్మిక అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇష్టమైన ప్రదేశం ఏదీ అని అడిగితే.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గులో ఉన్న ఆమె ఇల్లు అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. తాను ఏకంగా ఆరు బాషల్లో మాట్లాడగలనని తెలిపింది. ఇక హైదరాబాద్ వారితో మాట్లాడేటప్పుడు ‘నమస్తే బాగున్నారా’ అంటూ పలకరిస్తానని అంటోంది. అంతేకాదండోయ్ తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడి అందరిని ఖుషీ చేసింది. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే తనకు చాలా ఇష్టం అని రష్మిక తెలిపింది.
Ashish Vidyarthi : రెండో భార్యతో హనీమూన్లో ఆశిష్ విద్యార్థి..! ముసలోడే కానీ..
ప్రస్తుతం రష్మిక మూడు పెద్ద ప్రాజెక్ట్లలో నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తుంది. ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని మించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే తెలియజేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హిందీలో రణ్బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రంలో నటిస్తోంది. సందీప్ వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తోంది.