Meghalaya, Nagaland Assembly Polling 2023: ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
Exit poll results: నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో గెలుపొందుతుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. నాగాలాండ్ లోని 60 సీట్లలో బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి 35-43 మధ్య సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 1-3 సీట్లు రావచ్చని, ఎన్డీఎఫ్ కు 2-5 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేసింది.
మేఘాలయాలోని 60 సీట్లలో నేషనల్ పీపుల్స్ పార్టీ 21-26 సీట్లు గెలుచుకుంటుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. టీఎంసీ 8-13 మధ్య, బీజేపీ 6-11 మధ్య, కాంగ్రెస్ 3-6 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
మేఘాలయాలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 18-26 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ అంచనా వేసింది. బీజేపీ 3-6 మధ్య, కాంగ్రెస్ 2-5 మధ్య సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది.
మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ 18-24 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. బీజేపీ 4-8 మధ్య, కాంగ్రెస్ 6-12 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
త్రిపురలోని 60 సీట్లలో బీజేపీ 36-45 మధ్య సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. వామపక్ష పార్టీలు 6-11 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.
జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీ గెలుస్తుందని తేలింది. త్రిపురలో బీజేపీకి 29-36 సీట్లు వస్తాయని, వామపక్ష పార్టీలు 13-21 మధ్య సీట్లు గెలుచుకుంటాయని జీ న్యూస్-మాట్రిజ్ తెలిపింది.
మేఘాలయా, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగాయి. దీంతో పలు సంస్థలు ఆ మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.
Glimpses from the ongoing State Assembly Elections in #Nagaland#nagalandelections2023#NagalandAssemblyElection2023 pic.twitter.com/6CLqahfoQz
— PIB in Nagaland (@PIBKohima) February 27, 2023
మేఘాలయాలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం 74.32గా నమోదైంది.
A Naga lady comes out bringing her three children to vote. Citizens are keenly taking part in this festival of democracy.#NagalandAssemblyElection2023 pic.twitter.com/P3Oc2vlWMs
— PIB in Nagaland (@PIBKohima) February 27, 2023
A couple after casting their votes at Kohima #NagalandElections2023 @ecisveep @SpokespersonECI@ceonagaland@mygovnagaland@PIBKohima@dipr_nagaland@airnewsalerts@airkohima2 pic.twitter.com/poBDwLGcE5
— AIR News Kohima (@airnews_kohima) February 27, 2023
మేఘాలయాలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ 63.91 శాతంగా నమోదైంది. నాగాలాండ్ లో 72.99 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.
ఆరోగ్యం సహకరించకపోయినా కొందరు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు.
PwD Voter after casting his vote at Model Polling Station No. 9 Phaipijang GMS under Dimapur III.#eci #assemblyelections2023#nagalandelections2023 #novotertobeleftbehind @ecisveep @SpokespersonECI @mygovnagaland@PIBKohima @diprnagaland@airnews_kohima pic.twitter.com/G8N2V93o5s
— CEO Nagaland (@ceonagaland) February 27, 2023
…Because you have hope!
Location: A rural constituency in Khasi Jaintia region, Meghalaya. pic.twitter.com/y1ustq8IQm
— Karishma Hasnat (@karishmahasnat) February 27, 2023
DC & DEO Dimapur visiting polling stations overseeing peaceful, free and fair elections.#assemblyelections2023#nagalandelections2023 #novotertobeleftbehind pic.twitter.com/fTVpOUbKTA
— PIB in Nagaland (@PIBKohima) February 27, 2023
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో మధ్యాహ్నం 1గంట సమయానికి మేఘాలయలో 44.73శాతం ఓటింగ్ నమోదు కాగా, నాగాలాండ్ రాష్ట్రంలో 57.62శాతం మంది ఓటర్లు ఓటు వేశారు.
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తురా, గారో హిల్స్లోని వాల్బాక్రే -29 పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
అంపాటి నుంచి టీఎంసీ అభ్యర్థి మియాని డి షిరా, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కుమార్తె మేఘాలయ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మేఘాలయ, నాగాలాండ్ లలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. కాగా ఉదయం 11గంటల వరకు మేఘాలయలో 26.7 శాతం ఓట్లు పోలవ్వగా, నాగాలాండ్లో 38.2 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
నాగాలాండ్ సీఎం, ఎన్డీపీపీ అభ్యర్థి నెయిఫియూ రియో కహిమా జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
NDPP candidate & Nagaland CM Neiphiu Rio casts his vote in Kohima distirct pic.twitter.com/0TQwy2rQi7
— ANI (@ANI) February 27, 2023
మేఘాలయ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్, అస్సాంతో కూడిన సరిహద్దును అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. బంగ్లాదేశ్తో మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. అంతేకాక అస్సాంతో రాష్ట్ర సరిహద్దును కలిగిఉంది. ఈ రెండు సరిహద్దులను మూసివేసినట్లు మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగోర్ చెప్పారు.
నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెంజెన్ ఇమ్నా అలంగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తను పోలింగ్ కేంద్రానికి వెళ్లిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
Successfully casted my vote today for Nagaland Legislative Assembly Election 2023 ?️ pic.twitter.com/WAAxtOjsZi
— Temjen Imna Along (@AlongImna) February 27, 2023
మేఘాలయ బీజేపీ చీఫ్, వెస్ట్ షిల్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్నెస్ట్ మౌరీ పశ్చిమ షిల్లాంగ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తానని దీమాను వ్యక్తంచేశారు.
#MeghalayaElections2023 | I feel that my vote & people's vote will decide that I will win this constituency as an MLA: Ernest Mawrie, Meghalaya BJP chief and party's candidate from West Shillong constituency, after casting his vote pic.twitter.com/fAsWVzkXtF
— ANI (@ANI) February 27, 2023
మేఘాలయలో లెప్రసీ కాలనీలో కుష్టురోగుల కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తొలి తాత్కాలిక పోలింగ్ కేంద్రం..
States first temporary polling station set up especially for lepers in Leprosy colony Nongpoh Meghalaya@SpokespersonECI @ECISVEEP @PIBShillong pic.twitter.com/1UNPx8HX9G
— Chief Electoral Officer, Meghalaya (@ceomeghalaya) February 27, 2023
నాగాలాండ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో ఉదయం 9గంటల వరకు ఆ రాష్ట్రంలో 14.87 శాతం ఓటింగ్ నమోదైంది.
మేఘాలయ రాష్ట్రంలో ఉదయం 9గంటల వరకు 12.6 శాతం పోలింగ్ జరిగింది.
మేఘాలయ రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్న తొలి ఐదుగురు ఓటర్లకు ఎన్నికల అధికారులు మెమెంటోలను అందజేశారు. ముందస్తు ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు ఈ మెమెంటోలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు ప్రగతిశీల, సంక్షే ఆధారిత ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేందుకు మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొనే వారికి స్వాగతం అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్ ద్వారా తెలిపారు.
People of Meghalaya and Nagaland are looking towards progressive, welfare-oriented governments.
Welcome our first time voters to participate in this democratic process for a better future.
Urge our sisters and brothers of Meghalaya and Nagaland to give change a chance.
— Mallikarjun Kharge (@kharge) February 27, 2023
నాగాలాండ్ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియను సీఈఓ కార్యాలయం వద్ద వెబ్కాస్ట్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్న ఎలక్షన్ కమిషన్ సిబ్బంది.
నాగాలాండ్ రాష్ట్రంలోని షామటోర్ జిల్లాలో తమ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు.
Voters lining up in queue to cast their votes in Shamator District.#eci #assemblyelections2023#nagalandelections2023 #novotertobeleftbehind #ivote4sure #govote @ecisveep @SpokespersonECI @mygovnagaland@PIBKohima @diprnagaland@airnews_kohima pic.twitter.com/i9yDI1c6tL
— CEO Nagaland (@ceonagaland) February 27, 2023
ఈరోజు జరుగుతున్న నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలతో పాటు ఇటీవల త్రిపురలో జరిగిన పోలింగ్ కు సంబంధించి ఫలితాలను మార్చి 2న వెల్లడిస్తారు.
మేఘాలయలోని అమ్మారెమ్ నియోజకవర్గ పరిధిలోని కామ్సింగ్ పోలింగ్ కేంద్రం పరిధిలో 35మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సిబ్బంది పడవ సాయంతో నదిని దాటుకొని వెళ్లి అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
మేఘాలయ రాష్ట్రంలో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.
మేఘాలయ రాష్ట్రంలో 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 21,75,236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులు ఉన్నారు. వీరిలో 81వేల మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
As Meghalaya goes to vote today, I would appeal to the voters to elect a corruption-free government in the state.
Clean governance will ensure that government schemes reach the poorest of the poor and bring about prosperity in their lives. Come out and vote in large numbers.
— Amit Shah (@AmitShah) February 27, 2023
మేఘాలయలో ఓటు వేయనున్నందున, రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా కోరారు. క్లీన్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా, వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా కృషి జరుగుతుంది. పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ప్రతీఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
While Nagaland goes to vote today, I urge sisters and brothers of Nagaland to ensure that the peace process that has already been initiated does not face any hurdles.
Only peace can lead Nagaland to its destination of progress and development.
— Amit Shah (@AmitShah) February 27, 2023
నాగాలాండ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతీఒక్కరూ కృషిచేయాలి. శాంతి ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని నాగాలాండ్ సోదరీమణులను కోరుతున్నా అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. శాంతి మాత్రమే నాగాలాండ్ రాష్ట్రంను పురోగతి, అభివృద్ధి వైపు నడిపిస్తుందని అమిత్ షా అన్నారు.
నాగాలాండ్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ జరుగుతోంది.
#WATCH | Nagaland votes to elect a new government in the single-phased Assembly polls underway in 59 constituencies amid tight security
Visuals from Kohima pic.twitter.com/FmTxE48UPw
— ANI (@ANI) February 27, 2023
నాగాలాండ్ రాష్ట్రంలో ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 75శాతం ఓటింగ్ నమోదుకాగా, 2013లో 90.57 శాతం ఓటింగ్ నమోదైంది.
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు, ముఖ్యంగా యువత, మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లు ప్రతీఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగంచేసుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
Urging the people of Meghalaya and Nagaland, particularly the young and first time voters, to vote in record numbers today.
— Narendra Modi (@narendramodi) February 27, 2023
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్డీపీపీ అభ్యర్థులు 40 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో బరిలో నిలిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఎన్నికల అనంతర పొత్తు ఆలోచనకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధానంగా బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి కాంగ్రెస్, ఎన్పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి గట్టిపోటీ ఎదురవుతుంది.
నాగాలాండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాలేదు. రాష్ట్రంలో మహిళల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారికి శాసనసభలో అడుగుపెట్టేందుకు అవకాశం లభించలేదు. ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ విజయం సాధించలేక పోయారు. ఈసారి నలుగురు మహిళలు పోటీలో ఉన్నారు. దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాహులి సెమా అనే నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు విజయం సాధించినా ఆ రాష్ట్రంలో సరికొత్త రికార్డు నమోదైనట్లే.
మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీహిల్స్ ప్రాంతంలో పర్యావరణ అనుకూల మోడల్ పోలింగ్ స్టేషన్
An eco friendly model polling station in West Khasi hills Meghalaya
@ECISVEEP
@SpokespersonECI
@PIBShillong pic.twitter.com/GOX4zYrbEp— Chief Electoral Officer, Meghalaya (@ceomeghalaya) February 27, 2023
నాగాలాండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అకులుటో అసెంబ్లీ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. దీంతో 59 నియోజకవర్గాల్లో మాత్రమే పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13,17,632 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 6,61,489 మంది పురుషులు కాగా, 6,56,143 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,351 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.