Trisha: సౌత్ బ్యూటీ త్రిష ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అమ్మడి వయసు పెరుగుతూ ఉన్నా, సినిమాల్లో గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గకుండా చూస్తోంది ఈ బ్యూటీ. ఇక త్రిష ఇటీవల తమిళ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’లోనూ నటించి మెప్పించింది. కాగా, త్రిష లీడ్ రోల్లో నటించిన రీసెంట్ మూవీ ‘రాంగీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
Trisha: మళ్లీ ఆ ఇద్దరు హీరోలతో త్రిష రొమాన్స్.. ఈసారి ఎలా ఉంటుందో?
ఎం.శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో త్రిష తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్గా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ చేశారు చిత్ర యూనిట్. రాంగీ చిత్రాన్ని డిసెంబర్ 30న థియేటర్లలో రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 29న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
ఈ సినిమాపై త్రిష భారీ ఆశలు పెట్టుకున్నా, ఈ సినిమా కామన్ ఆడియెన్స్ను మెప్పించలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న త్రిష రాంగీ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ను అందిస్తారో చూడాలి.