Actor Naresh Challenge to who doing Movies Piracy
Naresh : సినిమా ఇండస్ట్రీకి ఉన్న పెద్ద సమస్య పైరసీ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమా రిలీజయిన రోజే పైరసీలో వచ్చేస్తుంది. థియేటర్స్ సినిమాలే కాదు ఓటీటీలో వచ్చే కొత్త సినిమాలు కూడా రిలీజయిన సాయంత్రానికే ఓటీటీలో ఉంటున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా సినీ పరిశ్రమను ఈ పైరసీ భూతం వదలట్లేదు.
అయితే ఇటీవల ఈ విన్ ఓటీటీలో వచ్చిన శశిమథనం సిరీస్ ని పైరసీ చేయలేకపోయారని, అది బయట ఎక్కడ పైరసీ రాలేదని, ఈ విన్ లోనే చూడాలని ఈ విన్ ప్రతినిధులు గొప్పగా చెప్పారు. అయితే పలువురు నిజంగానే పైరసీ అవ్వలేదా ఈ విన్ యాప్ ని అంత స్ట్రాంగ్ గా తయారుచేశారా అని ఆశ్చర్యపోయారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాగ్ మయూరి, ప్రియా వడ్లమాని, నరేష్ ముఖ్య పాత్రల్లో నటించిన వీరాంజనేయులు విహార యాత్ర సినిమా త్వరలో ఈ విన్ ఓటీటీలో రాబోతుంది.
Also Read : Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’లో ఫోక్ సాంగ్.. ఫ్లాష్ బ్యాక్లో.. లిరిక్ రైటర్ కామెంట్స్..
వీరాంజనేయులు విహార యాత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఎవ్వరూ పైరసీ చేయలేరు. ఈ విన్ ఓటీటీ నుంచి ఈ సినిమాని పైరసీ చేయలేరు. ఈ విన్ లో చూడాల్సిందే. ఎవ్వరూ పైరసీ చేయలేరు సవాల్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో నరేష్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ విన్ నుంచి వచ్చిన శశి మథనం సిరీస్ పైరసీ అవ్వలేదు, ఇప్పుడు ఇది కూడా పైరసీ రాకపోతే పైరసీకి ఈ విన్ ఓటీటీ ఏదైనా పరిష్కారం కనుక్కుందా అని చర్చగా మారడం ఖాయం. మరి నరేష్ సవాల్ ని పైరసీ చేసే వాళ్ళు తీసుకుంటారా చూడాలి. ఇక ఈ వీరాంజనేయులు విహారయాత్ర కామెడీ సినిమా ఆగస్టు 14 నుంచి ఓటీటీలో రానుంది.
"ఇది ETV WIN సినిమా…. ఎవరు Piracy చెయ్యలేరు…. బల్ల గుద్ది చెప్తున్నా…!"
Yet again, WIN comes up with an anti-piracy challenge for their upcoming original.#VeeranjaneyuluViharayathra#Naresh pic.twitter.com/z2b02WEDwY
— Gulte (@GulteOfficial) July 26, 2024