Vishal : తమిళ్ హీరో విశాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే మొదట్నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తాడు విశాల్. ఇటీవల తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని విమర్శలు చేసారు.
అయితే ఈ వివాదం పెద్దది అవ్వడంతో, అలాగే విశాల్ నిర్మాత సంఘంలో ఉన్నప్పుడు నిధులు అక్రమంగా వినియోగించారని ఆరోపిస్తూ విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దంటూ తమిళ నిర్మాతల సంఘం భావించింది. నిర్మాత కథిరేసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ నిర్మాత కథిరేసన్ ని, తమిళ నిర్మాత మండలిని డైరెక్ట్ గానే ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు.
విశాల్ తన ట్వీట్ లో.. మిస్టర్ కతిరేసన్ మీతో, టీమ్, అందరు వ్యక్తులు కలిసి తీసుకున్న నిర్ణయం అని మీకు తెలీదా. విద్య, వైద్య, బీమా, సీనియర్ నిర్మాతల కుటుంబ సంక్షేమం కోసం నిధులు ఉపయోగించబడ్డాయని మీకు తెలియదా. మీ ఉద్యోగాలను సరిగ్గా చేయండి, పరిశ్రమ కోసం చేయడానికి చాలా ఉంది. డబల్ ట్యాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ చార్జీలు.. ఇలా చాలా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. అసలు సినిమాలు తీయని నిర్మాతలు మీరు. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి అని ట్వీట్ చేసాడు.
దీంతో విశాల్ ట్వీట్ వైరల్ గా మారగా తమిళ పరిశ్రమలో విశాల్ వివాదం చర్చగా మారింది. రెగ్యులర్ గా ఇలా ఓపెన్ గానే అన్ని మాట్లాడేస్తూ వివాదాల్లో నిలుస్తున్న విశాల్, విశాల్ వ్యతిరేక వ్యక్తులు వీటికి ముగింపు చెప్తారా లేదా చూడాలి.
Don't u know that it is a collective decision which includes the person in your team,“Mr kathiresan” and the funds were used for the welfare works of the old/struggling members of the producers council that includes providing education, medical insurance and basic welfare during…
— Vishal (@VishalKOfficial) July 26, 2024