Return to Parliament: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుక్రవారం (ఆగస్టు 4) సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై కోర్టు స్టే విధించింది. గరిష్టంగా శిక్ష విధించేందుకు కింది కోర్టు న్యాయమూర్తి ఎలాంటి కారణం చెప్పలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. తుది తీర్పు వచ్చే వరకు దోషుల తీర్పుపై స్టే విధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు మార్చి 23న దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షను ప్రకటించిన 24 గంటల్లోనే అంటే మార్చి 24న రాహుల్ గాంధీ పార్లమెంటుకు అనర్హుడయ్యారు. కాగా, సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పార్లమెంటులోకి రాహుల్ తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అయితే పార్లమెంటులో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది అతిపెద్ద ప్రశ్న.
Meenakshi Lekhi: పార్లమెంటులో ఈడీ గురించి మాట్లాడి అడ్డంగా ఇరుక్కున్న కేంద్ర మంత్రి
సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని ఇప్పుడు లోక్సభ సెక్రటేరియట్కు పంపనున్నారు. అనంతరం దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినందున స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని స్పీకర్ ఎన్నికల సంఘానికి కూడా తెలియజేస్తారు. సోమవారం లేదా మంగళవారం నాటికి రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరించే అవకాశం ఉందట. రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Opposition Alliance I.N.D.I.A : విపక్షాల కూటమి I.N.D.I.Aపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని 24 గంటల్లో పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చిందని ఆ పార్టీ నేత రాజీవ్ శుక్లా అన్నారు. ‘‘మేము లోక్సభ స్పీకర్ను కలిశాము. మా నాయకుడిని త్వరగా సభకు అనుమతించమని చెప్పాము. కోర్టు నుంచి ఆర్డర్ కాపీ రావాలని స్పీకర్ అంటున్నారు’’ అని రాజీవ్ శుక్లా అన్నారు.