YS Sharmila: మీ మహమ్మారి పాలన అంతానికి.. ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు..!

దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల మరోసారి విమర్శల దాడికి దిగారు. ట్విటర్ వేదికగా కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కరోనా కంటే మించిన వైరస్‌లు వస్తాయని జ్యోస్యం చెప్పే దొర.. తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదులే ! అంటూ సెటైరికల్ గా విమర్శలు చేశారు. మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడించే అతి పెద్ద వైరస్. రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారి మీ పాలన. ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ మీరు. కరోనా‌తో పోరాడి నిలిచామేమో కానీ.. BRS వైరస్ కంట పడితే ఖేల్ ఖతం దుకాణం బంద్ అయినట్లేనని షర్మిల విమర్శలు చేశారు.

YS Sharmila: ఆక్రందన, ఆవేదన, ఆందోళన.. రోజులు దగ్గరపడ్డాయి: వైఎస్ షర్మిల కామెంట్స్

రాష్ట్రంలో వైద్యాన్ని ఉద్ధరించినట్లు ఉద్దెర మాటలు చెప్పే దొర.. నిమ్స్ విస్తరణకు కొబ్బరికాయ కొట్టారు సరే.. గత శంకుస్థాపనల సంగతి ఏంటో జర చెప్పు సారు.. అంటూ షర్మిల ప్రశ్నించారు. 15వందల కోట్లతో ఉస్మానియా దవాఖానకు కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ? నగరం నలుమూలల నాలుగు పెద్దాసుపత్రులు ఎక్కడ..? అక్కడ కార్పొరేట్ వైద్యం ఏమాయే.. ఎయిమ్స్‌ను మించిన ట్రీట్మెంట్ కనపడదాయే.. కొబ్బరికాయ కొట్టి 14నెలలైనా పునాదిరాయి పడక పాయె అంటూ షర్మిల విమర్శించారు.

CM KCR : నిమ్స్ కొత్త భవనానికి కేసీఆర్ భూమిపూజ

దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొబ్బరికాయలు, శంకుస్థాపనలు ఇదే మీరు 10 ఏళ్లలో సాధించిన ఆరోగ్య తెలంగాణ. మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారూ అంటూ షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు