తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

YS Sharmila Meets Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి విచ్చేసిన షర్మిలను సీఎం రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి, పూలకుండీ బహుకరించారు. ఈనెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. నిర్వహించే తాము కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల కోరారు.

అంతకుముందు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను ఆయన నివాసంలో వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

Also Read: అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్

తాడేపల్లిలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 8న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు తాడేపల్లిలోని CK కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు