బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ఆమెకి నిజ జీవితంలోను, సోషల్ మీడియాలోను ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లుగా అక్కడే కాపురం పెట్టింది.
భర్తో కలిసి బీచ్లకు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా అక్కడ దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తుంటుంది.. అంతేకదా.. సెలబ్రిటీలు ఏ పని చేసినా విశేషమే మరి.. వారికి ఉండే ఫాలోయింగ్ కూడా అలాంటిదే. అదే వారికి ప్లస్ పాయింట్ అవుతుంది కూడా..
ఇప్పటివరకు ప్రియాంక చోప్రాకి ఇన్స్టాగ్రామ్లో 50.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రిటీలకు కోట్లలో ఫాలోవర్స్ ఉండటం వల్ల కొన్ని అగ్ర సంస్ధలు వారికి అధిక మొత్తంలో డబ్బిచ్చి మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుంటారు. ఇది కూడా బిజినెస్సే కాబట్టి ఎవరి ఇమేజ్కి తగ్గట్టు వారు ఛార్జ్ చేస్తుంటారు. అలాగే ప్రియాంక కూడా తన ఇమేజ్ అండ్ ఫాలోయింగ్ని బట్టి భారీగానే ఛార్జ్ చేస్తుంది.
ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం ప్రియాంక చోప్రా అక్షరాలా రూ.2 కోట్లు తీసుకుంటుందని హోపర్ హెచ్క్యూ సంస్ధ తెలిపింది. రూ.2 కోట్లంటే ముంబయిలో ఓ ఇల్లు కొనొచ్చన్న మాట.. (ఈ జంట కాలిఫోర్నియాలో రూ.140 కోట్లతో విలాసవంతమైన ఇల్లు కొన్న సంగతి తెలిసిందే).. ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్లో ప్రియాంక చోప్రా 19వ స్ధానంలో ఉంది. ఇటీవల బాలీవుడ్లో ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో నటించి మెప్పించిన ప్రియాంక.. ప్రస్తుతం ‘వి కెన్ బి హీరోస్’, ‘ది మ్యాట్రిక్స్ 4’, ‘ది వైట్ టైగర్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంది..
See Also | పార్టీని గెలిపిస్తా…వేరేవారిని సీఎంను చేస్తా : రజనీకాంత్