Nijam with Smita : స్మిత కొత్త టాక్ షో.. ‘నిజం’ నిర్భయంగా..

ఈమధ్య కాలంలో టాక్ షోలు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రలో ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికి తెలుసు. ఇప్పుడు అదే దారిలో మరో టాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తన ఆల్బం సాంగ్స్ తో ఒకప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగించిన సింగర్ స్మిత ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుంది.

Nijam with Smita : ఈమధ్య కాలంలో టాక్ షోలు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రలో ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికి తెలుసు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించడం ఒక హైలైట్ అనుకుంటే, టాక్ షోకి కాంట్రవర్సీ పర్సన్స్ ని తీసుకు వచ్చి ప్రజలకు తెలియని ఎన్నో నిజాలని బాలయ్య ఆవిష్కరిస్తున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే దారిలో మరో టాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

తన ఆల్బం సాంగ్స్ తో ఒకప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగించిన సింగర్ స్మిత ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ లో ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకి ‘నిజం విత్ స్మిత’ అనే పేరుని పెట్టారు. తాజాగా ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ షోలో స్మితతో కలిసి ముచ్చటించడానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ని స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్మిత ‘ఎన్టీఆర్ వెన్నుపోటు’ విషయం గురించి ప్రశ్నించింది.

అలాగే మరో ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనగా.. సినిమాలోకి వచ్చిన మొదటిలో కులం ఏంటి అని అడిగారు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ మొదటి సినిమా కోటి మంది చూశారు. చూసిన వారే కదా నెపోటిజాని ప్రోత్సహిస్తుంది’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే రానా దగ్గుపాటి, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, సాయి పల్లవి, అడివి శేష్ కూడా ఈ షోకి హాజరయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు తెలియజేశారు. రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే స్మిత నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్నట్లు ఉంది. మరి చూడాలి ఈ షో కూడా ప్రజాధారణ పొందుతుందా? లేదా?

ట్రెండింగ్ వార్తలు