Tamil Nadu : ముస్లిం అన్నదమ్ములను ప్రేమించిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు వద్దనడంతో ఆత్మహత్య

Tamil Nadu : ముస్లిం అబ్బాయిలతో ప్రేమ వ్యవహారంపై వారు సీరియస్ అయ్యారు. వారితో ప్రేమ వద్దని వారించారు.

Tamil Nadu Sisters : తమిళనాడు తిరుచ్చిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఇద్దరమ్మాయిల ప్రాణం తీసింది. ముస్లిం అన్నదమ్ములతో ప్రేమ వద్దన్నారని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గాయత్రి(23), విద్య(21) అక్కాచెల్లెళ్లు. కోయంబత్తూరులోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తారు. వీరిద్దరూ అదే ఫ్యాక్టరీలో పని చేసే ముస్లిం సోదరులతో ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తరుచూ వారితో ఫోన్ లో మాట్లాడేవారు.

అయితే, ఈ విషయం అమ్మాయిల తల్లిదండ్రులకు తెలిసింది. ముస్లిం అబ్బాయిలతో ప్రేమ వ్యవహారంపై వారు సీరియస్ అయ్యారు. వారితో ప్రేమ వద్దని కూతుళ్లను వారించారు. తల్లిదండ్రులు అలా చెప్పేసరికి వారు షాక్ కి గురయ్యారు. అక్కాచెల్లెళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కాచెల్లెళ్ల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Also Read..Hyderabad : బాబోయ్.. పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు.. హైదరాబాద్‌లో కలకలం, అసలేం జరిగిందంటే

గ్రామంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు అక్క, చెల్లెలు ఇంటికి వచ్చారు. గాయత్రి తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి రోజు కూలీ. తండ్రి పిచాయ్, తల్లి అఖిలాండేశ్వరి.. తమ కూతుళ్లలో మార్పును గమనించారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇద్దరూ ఫోన్ లో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. దాంతో తల్లిదండ్రులు అనుమానం వచ్చి వారిని నిలదీశారు. తాము ప్రేమలో ఉన్నామని కూతుళ్లు తల్లిదండ్రులకు చెప్పారు. తమతో పాటు కంపెనీలో పని చేసే సహ ఉద్యోగులు, ముస్లిం సోదరులను తాము ప్రేమిస్తున్నట్లు తల్లిదండ్రులతో చెప్పేశారు. దాంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. వేరే మతం వారితో ప్రేమలో ఉన్నారని తెలుసుకుని మండిపడ్డారు.

ఆ మతం అబ్బాయిలతో ప్రేమ వద్దని కూతుళ్లను తల్లిదండ్రులు హెచ్చరించారు. తల్లిదండ్రులు అలా చెప్పడంతో కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఇద్దరి కోసం గాలించిన ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా వారి ఆచూకీ లేదు. ఇంతలో.. అమ్మాయిల ఇంటి దగ్గర ఉండే బావి దగ్గర రెండు మొబైల్ ఫోన్లను ఓ పశువుల కాపరి గుర్తించాడు. అనుమానం వచ్చి బావిలోకి తొంగిచూశాడు. అందులో శవం నీటిపై తేలుతూ కనిపించింది. అతడు షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బావిలోకి దిగి అక్కాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీశారు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. అమ్మాయిల ఫోన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు