38 jawans Covid-19 positive : దేశంలో కరోనా కేసులు పెరుగుదల చూస్తుంటే థర్డ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్నట్లే ఉంది.ఈ థర్డ్ వేవ్ లో కొత్త వేరియంట్లు కూడా తోడు కావటంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతేకాదు డాక్టర్లు,వైద్య సిబ్బందితో పాటు శాస్త్రవేత్తలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఈక్రమంలో కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. సిఆర్పిఎఫ్ లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్కు చెందిన సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు.
Read more : Corona India : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 37,379 పాజిటివ్ కేసులు
దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్ చేసామని అధికారులు తెలిపారు. 202 బెటాలియన్కు చెందిన కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్ (కోబ్రా) అనేది సీఆర్పీఎఫ్లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం (జనవరి 2,2022)సుక్మాకు వచ్చారని తెలిపారు. కొవిడ్ ప్రోటోకాల్స్లో భాగంగా 75 మందికి యాంటీజన్ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీవీ బన్సోడ్ తెలిపారు. వారి స్వాబ్తో కూడిన శాంపిల్స్ని ఆర్టీ- పీసీఆర్ పరీక్షల కోసం జగదల్పూర్కు పంపామని తెలిపారు. వారికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో వారితో కాంటాక్ట్ అయినవారిని గుర్తిస్తున్నామన్నామన్నారు.