Kohli And MS Dhoni: ధోని, కోహ్లీ సరిగ్గా ఆడకపోతే టీవీ రేటింగులు పడిపోతాయి: గ్రేమ్ స్వాన్

ఇండియన్ స్టార్ క్రికెటర్లు ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీలకు టీవీ రేటింగులను ప్రభావితం చేయగల శక్తి ఉందన్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. వాళ్లు సరిగ్గా ఆడకుంటే టీవీ రేటింగులు పడిపోతాయని స్వాన్ అన్నాడు.

Kohli And MS Dhoni: ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ సరిగ్గా బ్యాటింగ్ చేయకపోతే టీవీ రేటింగులు తగ్గిపోతాయని అభిప్రాయపడ్డాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. ఇంగ్లండ్ తరఫున పలు టెస్టులు, వన్డేలు ఆడిన గ్రేమ్ స్వాన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

టీవీ రేటింగులను ప్రభావితం చేయగల సత్తా ధోనీ, విరాట్ కోహ్లీలకు ఉందని గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లీ విజృంభించడం ఇండియాకు చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే టీవీ రేటింగులు పెరుగుతాయి. నేను టీవీ మాధ్యమంలో కూడా పనిచేశాను. ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ బాగా ఆడితే టీవీ రేటింగులు బాగుంటాయి. ఒకవేళ ఈ ఇద్దరూ సరిగ్గా ఆడకుంటే రేటింగులు పడిపోతాయి. నేను ఇండియాతో మ్యాచ్ ఆడినప్పుడు కూడా విరాట్ కోహ్లీ బాగా ఆడాలని కోరుకునేవాడిని.

Ponniyin Selvan 1 Review : పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. పక్కా తమిళ సినిమా..కొత్త సీసాలో పాత సాంబార్..

నేను కోహ్లీ బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతాను. అతడి ఆటతీరును దగ్గరినుంచి చూడాలనుకుంటాను. కోహ్లీ బ్యాటింగ్‌ను దగ్గరి నుంచి లేదా దూరం నుంచి చూసినా ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని గ్రేమ్ స్వాన్ వ్యాఖ్యానించాడు. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కోహ్లీ ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు.

 

ట్రెండింగ్ వార్తలు