Shikhar Dhawan : క్రికెటర్ శిఖర్ ధావన్ భార్య ఆయేషాకు 8 ఏళ్లలో ఎన్ని కోట్లరూపాయలు ఇచ్చారంటే…

ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం తన మాజీ భార్య భర్తను మానసికంగా హింసించిందని వెల్లడైంది. శిఖర్ ధావన్ 8 సంవత్సరాల్లో తన భార్య ఆయేషాకు రూ.13 కోట్లు పంపించాడని తాజాగా వెలుగుచూసింది....

Shikhar Dhawan : ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం తన మాజీ భార్య భర్తను మానసికంగా హింసించిందని వెల్లడైంది. శిఖర్ ధావన్ 8 సంవత్సరాల్లో తన భార్య ఆయేషాకు రూ.13 కోట్లు పంపించాడని తాజాగా వెలుగుచూసింది. భారతదేశం తరపున చాలా కాలం పాటు ఆడిన శిఖర్ ధావన్ 2012వ సంవత్సరంలో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహం 2020లో ముగిసింది. ఆయేషా తనను మానసికంగా హింసించిందని శిఖర్ ఆరోపించారు.

Also Read : Pakistan : పాకిస్థాన్‌లో కలకలం…4 లక్షల మందికి కండ్లకలక

తాను ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తుల్లో 99 శాతం వాటాను ఆయేషా కోరుకుంటుందని ధావన్ ఆరోపించారు. కొవిడ్-19 సమయంలో తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు శిఖర్‌తో ఆయేషా గొడవ పడింది. భార్య క్రూరత్వం కారణంగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ కు విడాకులు మంజూరు చేసింది. శిఖర్ విడాకులు తీసుకున్న తర్వాత లాయర్ దీపికా భరద్వాజ్ ట్వీట్ చేశారు. శిఖర్ ఆయేషాతో 8 ఏళ్ల వివాహంలో కంటిన్యూగా కలిసి జీవించలేదని తేలింది.

Also Read : Climate Disasters: వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లల మృతి…ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదిక వెల్లడి

వారి కుమారుడు జోరావర్ కూడా ఆస్ట్రేలియాలో జన్మించినందున, శిఖర్ తన కుమారుడితో ఎక్కువ కాలం గడపలేకపోయారు. ఆయేషాతో పెళ్లి తర్వాత ప్రయాణాలు, హోటళ్లలో గడపటం ద్వారా విలాసవంతమైన జీవనశైలి కోసం శిఖర్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని లాయర్ చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆస్తులన్నింటిని ఆయేషా పేరు మీద బదిలీ చేయడానికి, ఆమె కుమార్తెల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు శిఖర్ నిరాకరించడంతో వారి వివాహం విచ్ఛిన్నమైంది.

ట్రెండింగ్ వార్తలు