17 ఏళ్ల నిరీక్షణ తరువాత భారత జట్టు టీ20 ప్రపంచకప్ను సాధించింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక టీ20 ప్రపంచకప్తో భారత ప్లేయర్లు ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీ టీ20 ప్రపంచకప్తో దిగిన ఫోటోలు వైరల్గా మారాయి. అయితే.. వాటిని ఓ నకిలీ ఖాతా పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని బుమ్రా భార్య సంజనా గణేశన్ తెలిపింది.
తన పేరుతో ఫేక్ అకౌంట్ను క్రియేట్ చేసి సదరు ఫోటోలను పోస్ట్ చేసినట్లుగా వెల్లడించింది. ‘మా కుటుంబం ఫోటోలు, సమాచారం దొంగిలించి.. నా ఖాతా లాగా ఓ ఫేక్ అకౌంట్ క్రికెట్ చేశారు. వెంటనే సదరు అకౌంట్ను తొలగించాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.’ అని ఆమె తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Babar Azam : బాబర్ ఆజాంకు ఘోర అమానం..! నేపాల్ జట్టులోనూ నో ప్లేస్..!
ఇదిలా ఉంటే.. భారత జట్టు టీ20 ప్రపంచకప్ సాధించడంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా భారత్ విజయంపై సంజనా ఎమోషనల్ పోస్ట్ చేసింది. టీమ్ఇండియా పడిన కష్టం గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదంది. ఇప్పటికి ఒక కలలా అనిపిస్తోందని చెప్పింది. టీమ్ఇండియా ఛాంపియన్గా నిలిచిన ఈ సందర్భాన్ని తన జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది.
Hi, this is a stolen identity and stolen content. I’ve reported your account, take it down or I’ll have to initiate legal action.
— Sanjana Ganesan (@SanjanaGanesan) July 1, 2024
ఇక తన భర్త బుమ్రా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలిపింది. మీరు నాకు సొంతం అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అని సంజనా తెలిపింది. ఒక భారతీయురాలిగా, భార్యగా, బ్రాడ్కాస్టర్గా, తల్లిగా ఇది ఒక ప్రధాన జ్ఞాపకం. నేను దీన్ని చాలా కాలం పాటు నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను అని సంజన అంది.
తుఫాన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా బృందం గురువారం ఉదయం భారత్కు చేరుకోనుంది.