ODI World Cup : వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయంతో బోణీ చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యమే అయినప్పటికీ రెండు పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లు డకౌట్లు కావడంతో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. అయితే.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించారు.
ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్కు సైతం ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అనారోగ్యం కారణంగా ఆసీస్తో జరిగిన మొదటి వన్డే ఆడని గిల్ రెండో వన్డేకు సైతం దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది. అతడు జట్టుతో పాటు ఢిల్లీ వెళ్లడం లేదని చెన్నైలోనే ఉంటాడని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచకప్లో టీమ్ఇండియా బుధవారం అక్టోబర్ 11న తన రెండో మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. కాగా.. నివేదికల ప్రకారం శుభ్మన్ గిల్ డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు కోలుకునేందుకు వారం నుంచి పది రోజుల సమయం అవసరం. ఈ క్రమంలో శనివారం పాకిస్తాన్తో మ్యాచ్ నాటికి జట్టు సెలక్షన్కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
🚨 Medical Update: Shubman Gill 🚨
More Details 🔽 #TeamIndia | #CWC23 | #MeninBluehttps://t.co/qbzHChSMnm
— BCCI (@BCCI) October 9, 2023