World Cup 2023 IND vs PAK : వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ అభిమానులకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బాబర్ పై సోషల్ మీడియా వేదికగా వారు మండిపడుతున్నారు. ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఇందుకు ఇది తగిన సమయం కాదని అంటున్నారు.
బాబర్ ఏం చేశాడంటే..?
మ్యాచ్ ముగిసిన అనంతరం భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని బాబర్ ఆజాం మైదానంలో కలుసుకున్నాడు. ఈ క్రమంలో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్తో కూడిన తన జెర్సీలను బాబర్ ఆజాంకు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై పలువురు పాక్ మాజీ ఆటగాళ్లతో పాటు ఆ జట్టు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పాక్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ.. బాబర్ చేసిన పని తనకు నచ్చలేదన్నాడు. ఒకవేళ అతడికి కోహ్లీ జెర్సీ కావాలనుకుంటే ఇలా పబ్లిక్గా కాకుండా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లి తీసుకోవాల్సింది అని అన్నాడు. తనకు తెలిసినంత వరకు బాబర్ వాళ్ల అంకుల్ కొడుకు అతడిని కోహ్లీ జెర్సీని తీసుకురావాలని కోరాడు. ఏదేమైనా సరే.. మ్యాచ్ ఓడిపోయిన ఈ సమయంలో ఇలా పబ్లిక్గా బాబర్ ఈ పని చేయడం మాత్రం బాగాలేదు అని అక్రమ్ అన్నాడు.