హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ చేరుకున్నారు.
దేశ రాజ్యాంగం, సమాఖ్య విధానానికి సవాళ్లు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం అన్నారు. సమాఖ్య విధానాన్ని క్రమంగా బలహీనపర్చుతున్నారని చెప్పారు.
సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. అనంతరం పలువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.
AICC president shri Mallikarjun Kharge Ji hoisted the Flag, marking the beginning of #CWC in Hyderabad,Telangana. #CWCMeetingHyd #SoniammaInTelangana#CongressVijayabheri pic.twitter.com/84jCyZISnf
— Revanth Reddy (@revanth_anumula) September 16, 2023
नमस्कार तेलंगाना 🙏🏻 pic.twitter.com/WDYv3Dv4Gu
— Congress (@INCIndia) September 16, 2023
हैदराबाद में कांग्रेस की नवगठित वर्किंग कमेटी (CWC) की बैठक हो रही है।
इस बैठक में आगामी चुनाव के मद्देनजर जनता से जुड़े जरूरी मुद्दों पर चर्चा की जाएगी। pic.twitter.com/mWnjMwyfQB
— Congress (@INCIndia) September 16, 2023
సీడబ్ల్యూసీ సమావేశాలు తొలిరోజు రాత్రి 7 గంటలకు ముగుస్తాయి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ అలాగే డిన్నర్ ఉంటుంది. రేపు ఉదయం 10:30 గంటలకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అవుతుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జెండా ఎగరేసి.. సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు.
తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. మల్లికార్జున ఖర్గే.
ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు
సిడబ్ల్యుసి వర్కింగ్ కమిటీ సమావేశానికి విచ్చేసిన నేతలను శంషాబాద్ ఏర్పాటులో రిసీవ్ చేరుకున్న కేసి వేణుగోపాల్, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఠాక్రే, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన రేవంత్, మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు
తాజ్ కృష్ణ మీడియా పాయింట్ వద్ద CWC మెంబర్ పవన్ ఖేరా మాట్లాడారు.. దేశ ప్రజలంతా హైదరాబాద్వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని, రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిని ఎన్నికకూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని చెప్పారు. CWC సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తామని అన్నారు. మేం ఏ జర్నలిస్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళని దూరంపెట్టాలని అనుకున్నామని పవన్ ఖర్గే అన్నారు.
Cwc సమావేశానికి వచ్చే సభ్యులకు రాత్రి కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటుతో పాటు, భారత్ జోడో యాత్రకు సంబందించిన చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్నుకూడా ఏర్పాటు చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే అతిథులకు తెలంగాణ సంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతున్న టీ కాంగ్రెస్.. కోయలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే సీతక్క.
ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు స్వాగతం పలికేందుకు తాజ్కృష్ణ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు బయలుదేరిన కేసీ వేణుగోపాల్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
రేపు ఉదయం 10.30 గంటలకు ఎక్స్టెండెడ్ డబ్ల్యూసీ సమావేశం.
మధ్యాహ్నం 2గంటలకు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ
CWC సమావేశం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ రానున్నారు. నగరంలోని హోటల్ తాజ్కృషా వేదికగా శనివారం, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకోసం హోటల్ తాజ్ కృష్ణలో భారీగా ఏర్పాట్లు చేశారు. సమావేశాలు ముగిసిన తరువాత తుక్కుగూడలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా, రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.