బీఆర్ఎస్ నేత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణమోహన్ రెడ్డికి, గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సరితకు మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత హస్తం పార్టీలో చేరారు.
ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. కృష్ణ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ చేర్చుకోవద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్లగుంట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన తెలుపుతుండగా పక్కనే వున్న సెల్ టవర్ ఎక్కాడు మరో కాంగ్రెస్ కార్యకర్త.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేర్చుకుంటే తాను టవర్ పైనుండి దూకుతానని బెదిరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని కిందికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పార్టీ మార్పుపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణ మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరారు.
Also Read: చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం: వైఎస్ జగన్