PM Modi : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ

ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.

PM Modi – SC Classification : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీల పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.

బీఆర్ఎస్, ఆప్ రెండూ కలిసి అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత ద్రోహి పార్టీలని విమర్శించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మందకృష్ణ 30 ఏళ్లుగా ఒకే లక్ష్యంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

Manda Krishna: మోదీని పట్టుకుని భోరున విలపించిన మంద కృష్ణ

సాధారణంగా అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో అవినీతి విషయంలో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.

ఇలా అవినీతి కోసం ప్రభుత్వాలు కలిసి పని చేయడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద మద్దతుదారు అని తెలిపారు. అలాంటి ఆప్ తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు