T20 World Cup : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్కు చేరుకున్నప్పటికీ ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. దీంతో ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందారు. ఈ ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ పై దృష్టి సారింది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం ఎంపిక చేయనున్నారు.
కాగా.. ఇప్పటికే ఈ మెగా టోర్నీ పై దృష్టి సారించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 25 నుంచి 30 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ ఆటగాళ్లను ఐపీఎల్ సీజన్ మొత్తం పర్యవేక్షించనున్నారని, ఆ తరువాత వీరిలోంచి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు ఉండనున్నారనే వార్తలు వస్తున్నాయి.
Hardik pandya : కొత్త ఏడాదిలో అదిరిపోయే వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్య.. దేనికి సంకేతం ఇది..!
రోహిత్- కోహ్లీలు ఆడతారా..?
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీమ్ఇండియా తరుపున మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ విషయమై వీరిద్దరితో మాట్లాడడంతో పాటు షార్ట్ లిస్టులో ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయమై కోచ్ రాహుల్ ద్రవిడ్తో చర్చించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కేప్టౌన్కు వెళ్లనున్నారు. ప్రతి స్థానానికి కనీసం ఇద్దరు ఆటగాళ్లతో పెద్ద పూల్ను తయారు చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయపడిన ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపికకు ఇబ్బంది లేకుండా కసరత్తులు చేస్తున్నారు. షార్ట్లిస్ట్లోని ఆటగాళ్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిజియోలు, బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లు ఫిట్గా లేరు. గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరిద్దరు అఫ్గాన్ సిరీస్లో ఆడే విషయమైన ఇప్పటికైతే ఖచ్చితమైన సమాచారం లేదు. ఐపీఎల్ సమయానికి వీరిద్దరి ఫిట్నెస్తో పాటు ఎవరెవరు టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగుతారు అనే విషయమై స్పష్టత వస్తుందని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.
Glenn Maxwell : ఈ షాట్ను ఏమని అనాలో..! బీబీఎల్లో వినూత్న షాట్ ఆడిన మాక్స్వెల్
ఇదిలా ఉంటే.. భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. కేప్టౌన్ వేదికగా బుధవారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భారత జట్టు పట్టుదల ఉంది.